Champions Of Change-2019: ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న అల్లు అరవింద్

  • అల్లు అరవింద్ కు 'చాంపియన్స్ ఆఫ్ చేంజ్' అవార్డు
  • సినీ రంగానికి విశిష్ట సేవలందించినందుకు పురస్కారం
  • ఢిల్లీలో అవార్డుల కార్యక్రమం

టాలీవుడ్ లో దశాబ్దాల తరబడి విజయవంతమైన నిర్మాతగా ప్రస్థానం కొనసాగిస్తున్న అల్లు అరవింద్ కు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. అల్లు అరవింద్ ను 'చాంపియన్స్ ఆఫ్ చేంజ్-2019' అవార్డుకు ఎంపిక చేశారు. సినీ రంగానికి విశేష సేవలందించినందుకు గాను అరవింద్ కు ఈ అవార్డును అందించారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అల్లు అరవింద్ కు ప్రదానం చేశారు.

More Telugu News