Andhra Pradesh: ఇంత జరుగుతుంటే ఈ మనిషికి ఎలా నిద్ర పడుతోంది?: సీఎం జగన్ పై లోకేశ్ ధ్వజం

  • ట్విట్టర్ లో లోకేశ్ స్పందన
  • అసెంబ్లీ ముట్టడికి రైతుల యత్నం
  • రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ
  • జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్

ఓవైపు రాజధాని ముట్టడి, మరోవైపు అసెంబ్లీలో వాడీవేడి వాతావరణం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో జగన్ నిద్రపోతున్న దృశ్యాన్ని లోకేశ్ ట్వీట్ చేశారు. ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు అసెంబ్లీ ముట్టడికి తరలివస్తుంటే, మరో పక్క రాష్ట్రమంతా టీవీల్లో ప్రస్తుత పరిస్థితిని వీక్షిస్తుంటే... ఈ మనిషికి ఎలా నిద్రపడుతోంది? అంటూ మండిపడ్డారు.

More Telugu News