Nara Lokesh: ఇప్పుడు నిజంగా ఈ జన ప్రవాహం అసెంబ్లీ ప్రాంతాన్ని ముంచెత్తడాన్ని చూడండి: లోకేశ్

  • అమరావతిని కృష్ణమ్మ ముంచెత్తుతుందని అబద్ధపు ప్రచారం చేశారు 
  • మహిళలు, పిల్లలు సైతం ప్రభుత్వ నిర్బంధాలను ఛేదించుకుని వచ్చారు
  • ప్రభుత్వం మొండి నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వం కాదా? 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై గతంలో వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి రాజధాని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

'అమరావతిని కృష్ణమ్మ ముంచెత్తుతుందని వైసీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేశారు. ఇప్పుడు నిజంగా ఈ జనప్రవాహం అసెంబ్లీ ప్రాంతాన్ని ముంచెత్తడాన్ని చూడండి. మహిళలు, పిల్లలు సైతం ప్రభుత్వ నిర్బంధాలను ఛేదించుకుని ఎలా వెల్లువెత్తారో చూశాక కూడా ప్రభుత్వం మొండి నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వం కాదా?' అని లోకేశ్ విమర్శించారు.

More Telugu News