Amaravati: ఏపీ కేబినెట్ నిర్ణయంతో బోరున విలపించిన రాజధాని మహిళలు

  • హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్రపై ఆగ్రహం
  • అసెంబ్లీ సమీపానికి చేరుకున్న మహిళా రైతులు  
  • తమను ఇబ్బంది పెట్టేలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని మహిళా రైతులు కంటతడి పెట్టుకున్నారు. ఈ రోజు అసెంబ్లీ సమీపానికి చేరుకున్న మహిళా రైతులు మీడియాతో మాట్లాడుతూ తమకు అన్యాయం చేయొద్దంటూ బోరున విలపించారు.

పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ కొత్తగా తమను ఇబ్బంది పెట్టేలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని రాజధాని మహిళలు నిలదీశారు. ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. వెలగపూడి పొలాల నుంచి అసెంబ్లీ ముట్టడికి రైతులు, మహిళలు ర్యాలీగా వెళ్తున్నారు.

More Telugu News