Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!

  • పరిపాలన వికేంద్రీకరణకు ఆమోదం
  • సీఆర్డీఏ ఉపసంహరణ
  • మున్సిపల్ కార్పొరేషన్ గా అమరావతి ప్రాంతం

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కొనసాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు ఇవే. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదముద్ర.

  • పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం.
  • రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయం.
  • రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు.
  • సీఆర్డీఏ ఉపసంహరణకు ఆమోదం.
  • 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • విశాఖకు సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల తరలింపు
  • అమరావతిలోనే అసెంబ్లీ మూడు సెషన్లు
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ఆమోదం

More Telugu News