Mahesh Babu: నైజామ్ లో 'మహర్షి' రికార్డును అధిగమించిన 'సరిలేరు నీకెవ్వరు'

  • ఈ నెల 11న వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ల నమోదు 
  • నైజామ్ లో 35 కోట్లకి పైగా షేర్ సాధించే ఛాన్స్  

హీరోగా మహేశ్ బాబు ఈ మధ్య వరుస విజయాలను అందుకుంటూ వెళుతున్నాడు. ఇక దర్శకుడిగా అనిల్ రావిపూడి కూడా వరుస విజయాలను తన ఖాతాలో జమ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సంక్రాంతి కానుకగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.

ముఖ్యంగా నైజామ్ లో ఈ సినిమా తన సత్తా చూపుతోంది. నిన్న ఒక్కరోజునే ఈ సినిమా ఇక్కడ 2 కోట్లకి పైగా షేర్ సాధించడం విశేషం. దాంతో ఇంతవరకూ ఈ సినిమా ఇక్కడ 32.1 కోట్ల షేర్ ను సాధించింది. గతంలో 'మహర్షి' సినిమా ఇక్కడ 30 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అంతకు మించిన వసూళ్లతో 'మహర్షి' రికార్డును 'సరిలేరు నీకెవ్వరు' అధిగమించింది. నైజామ్ లో ఈ సినిమా 35 కోట్లకి పైగా షేర్ ను సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News