Andhra Pradesh: రాజధానిపై ప్రజాభిప్రాయ సేకరణ... అమరావతి కోసం భారీగా పోలైన ఓట్లు!

  • కాకుమాను, తెనాలిలో ప్రజాభిప్రాయసేకరణ
  • అత్యధికులు అమరావతికే మొగ్గు
  • తేలిపోయిన మూడు రాజధానుల నిర్ణయం
  • మూడు రాజధానులకు పెద్దగా లభించని స్పందన

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలా, వద్దా అనే అంశంపై అనేక ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కాకుమానులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అమరావతికి మద్దతుగా భారీగా ఓట్లు పోలయ్యాయి. అమరావతికి అనుకూలంగా 1603 ఓట్లు రాగా, వ్యతిరేకంగా కేవలం 3 ఓట్లు వచ్చాయి. తెనాలిలో ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా, అమరావతికి అనుకూలంగా 8050 ఓట్లు, మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా 24 ఓట్లు లభించాయి.

More Telugu News