Allari Naresh: 'అల్లరి' నరేశ్ తో సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం

  • ముగింపు దశలో 'బంగారు బుల్లోడు'
  • తదుపరి చిత్రానికి దర్శకుడిగా విజయ్ కనకమేడల 
  • ఈ నెల 20వ తేదీన పూజా కార్యక్రమాలు    

హాస్య కథానాయకుడిగా తెరపై నాన్ స్టాప్ గా 'అల్లరి' చేసిన నరేశ్, చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేశాడు. ఆ తరువాత ఆయన జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, మంచి కథల కోసం వెయిట్ చేస్తూ సినిమాల సంఖ్యను తగ్గించాడు. ప్రస్తుతం ఆయన 'బంగారు బుల్లోడు' సినిమాను చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.

దాంతో ఆయన తదుపరి సినిమాకి రంగం సిద్ధమవుతోంది. దర్శకుడు సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఆ రోజున ఉదయం 9 గంటల 44 నిమిషాలకి హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కెరియర్ పరంగా 'అల్లరి నరేశ్ కి ఇది 57వ సినిమా. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం.

More Telugu News