Crime News: కుమారుడు, కోడలు పట్టించుకోవట్లేదని వృద్ధ దంపతుల ఆత్మహత్య

  • జయ శంకర్ భూపాల పల్లి జిల్లా చిట్యాలలో ఘటన
  • పురుగుల మందుతాగి దంపతులు చెలిమల్ల రాజయ్య, లక్ష్మి ఆత్మహత్య
  • దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

ఆ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.. అందరికీ పెళ్లిళ్లు చేశారు. కుమారుడు, కోడలు వద్ద ఉంటున్నారు. అయితే, వారిని కుమారుడు, కోడలు కొంత కాలంగా పట్టించుకోవట్లేదు. దీంతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వృద్ధ దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతుల పేర్లు చెలిమల్ల రాజయ్య, లక్ష్మి అని తెలిపారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

More Telugu News