BJP: ఢిల్లీ రావాలంటూ అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోర్ గ్రూప్ సభ్యులకు బీజేపీ హైకమాండ్ ఆదేశం

  • ఈ నెల 20న ఢిల్లీ రావాలని సందేశం
  • జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు అందుబాటులో ఉండాలని సూచన
  • నామినేషన్ దాఖలు చేయనున్న జేపీ నడ్డా

ఈ నెల 20న ఢిల్లీ రావాలంటూ దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోర్ గ్రూప్ సభ్యులకు ఈ మేరకు బీజేపీ అధినాయకత్వం నుంచి సందేశాలు వెళ్లాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉన్నందున అందరూ అందుబాటులో ఉండాలని ఆ సందేశాల్లో పేర్కొన్నారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమే. అధ్యక్ష పదవి కోసం నడ్డా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

More Telugu News