Varla Ramaiah: అన్నా, ఉదయం సెషన్ కోర్టులో ఉంటాను, మధ్యాహ్నం నీ వద్దకు వస్తానని కేసీఆర్ కు చెప్పాల్సింది: సీఎం జగన్ పై వర్ల విమర్శలు

  • రూ.60 వాటర్ బాటిల్ వాడినందుకు చంద్రబాబును విమర్శించారన్న వర్ల
  • ఇప్పుడు సీఎం ప్రత్యేక విమానంలో వెళ్లాడంటూ ఆరోపణలు
  • ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా అంటూ నిలదీత

నాడు చంద్రబాబు రూ.60 వాటర్ బాటిల్ టేబుల్ పై ఉంచుకుంటే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ వాళ్లు వ్యాఖ్యానించారని, ఇప్పుడు సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కోసం ఖర్చు చేసింది ప్రజాధనం దుర్వినియోగం కిందికి రాదా? అని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.

"మొన్న కేసీఆర్ వద్దకు సీఎం జగన్ ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఎందుకు వెళ్లారు సార్ మీరు? ఎంత ఖర్చయింది సార్, ఎన్ని లక్షలు కట్టారు సార్? మీరు ప్రతి శుక్రవారం హైదరాబాదు వెళతారు కదా. మొన్న కూడా వెళ్లారు. అదే రోజున సీఎం కేసీఆర్ ను కూడా కలిస్తే సరిపోయేది. అన్నా, ఉదయం సెషన్ కోర్టులో ఉంటాను, మధ్యాహ్నం నుంచి నీ వద్ద ఉంటాను అని చెబితే బాగుండేది. ప్రభుత్వానికి ఎన్నో లక్షలు మిగిలేవి. రూ.60 వాటర్ బాటిల్ గురించి మీరు మాట్లాడినప్పుడు, మీరు ప్రత్యేక విమానంలో వెళితే మేం మాట్లాడమా! ఆత్మపరిశీలన చేసుకోవాలనే చెబుతున్నాం" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News