Andhra Pradesh: ఏపీ కేబినెట్ సమావేశం ప్రీపోన్.. రేపే భేటీ!

  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం
  • 3 గంటల పాటు కొనసాగనున్న భేటీ
  • రాజధాని నివేదికలపై చర్చించనున్న వైనం

ఈనెల 20న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం ప్రీపోన్ అయింది. రేపే సమావేశాన్ని నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ ముందు జరగడం మంచిదనే భావనతో తేదీని ముందుకు మార్చారు. కేబినెట్ భేటీ దాదాపు 3 గంటల సేపు కొనసాగే అవకాశం ఉంది. రాజధానికి సంబంధించి జీఎన్ రావు, బీసీజీ, హైపవర్ కమిటీ నివేదికల గురించి కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

More Telugu News