India: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

  • రాజ్‌కోట్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే
  • టీమిండియాలో రెండు మార్పులు
  • రిషభ్ పంత్ స్థానంలో మనీశ్ పాండే
  • శార్దూల్ స్థానంలో సైనీ 

రాజ్‌కోట్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. రిషభ్ పంత్ స్థానంలో మనీశ్ పాండే, శార్దూల్ స్థానంలో సైనీ జట్టులోకి వచ్చారు.

    టీమిండియాలో రోహిత్ శర్మ, ధావన్, కేఎల్ రాహుల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, షమీ, సైనీ, బుమ్రా ఉన్నారు. తొలి వన్డేలో టీమిండియాకు ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. ముంబయి వాంఖడే స్టేడియంలో 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించింది. దీంతో రెండో వన్డే మ్యాచ్‌లోనైనా గెలవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది.

More Telugu News