Raana: కేరళ అడవుల్లో రానా 'విరాట పర్వం'

  • రానా తాజా చిత్రంగా 'విరాటపర్వం'
  • కథానాయికగా సాయిపల్లవి 
  •  ముఖ్య పాత్రల్లో టబు .. ప్రియమణి

రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' రూపొందుతోంది. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది.

అడవి నేపథ్యంలో రానా తదితరులపై గెరిల్లా తరహా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఈ పోరాట సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ప్రియమణి .. టబు .. ఈశ్వరీరావు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా .. తన పాత్ర తన కెరియర్లో చెప్పుకోదగినవిగా గుర్తుండిపోతాయని రానా భావిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.

More Telugu News