Jagan: జగన్ అక్రమాస్తుల కేసు: నేటి విచారణకు జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు

  • హైదరాబాద్‌, నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ
  • విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన హాజరు 
  • గత శుక్రవారం కోర్టుకు హాజరైన జగన్ 

హైదరాబాద్‌లోని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం కోర్టుకు విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. గత శుక్రవారం విచారణకు హాజరైన జగన్, నేడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా, న్యాయస్థానం అనుమతించింది.

ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లన్నీ ఒకేసారి విచారించాలని గత వారం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. సీబీఐ తరఫున సురేందర్ రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.

More Telugu News