YSRCP: కడప నుంచి విజయవాడ వెళ్లే విమానానికి తప్పిన ముప్పు

  • టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానానికి పక్షి ఢీ
  • వెనక్కి మళ్లించి అత్యవసరంగా దించేసిన పైలెట్
  • విమానంలో వైసీపీ నేత సజ్జల  

కడప నుంచి విజయవాడ వెళ్లే ట్రూ జెట్ విమానానికి ఈ రోజు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కడప విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానానికి ఓ పక్షి తగిలింది. దాంతో ఆ విమానాన్ని వెనక్కిమళ్లించి అత్యవసరంగా కిందికి దించారు. ఆ సమయంలో విమానంలో 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వున్నారు. మరో విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

More Telugu News