Crime News: సిద్ధిపేట జిల్లా ఎంపీపీ అసభ్యంగా ప్రవర్తించాడని యువతి ఫిర్యాదు

  • సిద్ధిపేట జిల్లాలోని మిర్దొడ్డి ఎంపీపీ సాయిలు
  • భూ వివాదంలో యువతిపై దాడి
  • పంట తగుల బెట్టాడని చెప్పిన యువతి

సిద్ధిపేట జిల్లా మిర్దొడ్డి ఎంపీపీ సాయిలుపై పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఓ విషయంపై ఆయన వద్దకు వెళ్తే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తెలిపింది. అంతేగాక, భూ వివాదంలో ఎంపీపీ తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది.

పెద్ద చెప్యాల ప్రాంతానికి చెందిన ఆ యువతి ఇటీవల తన భూ సమస్యపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. శ్మశాన వాటిక కోసం తన భూమిని ఆక్రమించారని ఆమె పోరాడుతోంది. ఈ నేపథ్యంలోనే తన భూమిలోని పంటలను ఎంపీపీ ధ్వంసం చేశారని బాధిత యువతి చెప్పింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, ఎంపీపీ బారి నుంచి కాపాడాలని వేడుకుంది.

More Telugu News