Mahesh Babu: నైజామ్ లో రికార్డు సృష్టిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు'

  • మహేశ్ ఖాతాలోకి మరో హిట్ 
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • నైజామ్ ఏరియాలో అత్యధిక వసూళ్లు

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఐదు రోజులకుగాను ఈ సినిమా 68.22కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ముఖ్యంగా నైజామ్ లో రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతోంది. ఐదు రోజులకుగాను ఈ సినిమా నైజామ్ లో 22.5 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజామ్ ఏరియాలో మహేశ్ బాబు సినిమాల్లో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా 'మహర్షి' రికార్డును నెలకొల్పింది. ఆ రికార్డును 'సరిలేరు నీకెవ్వరు' అధిగమించడానికి ఎంతో సమయం పట్టదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సూపర్ హిట్ సినిమా ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల ఆమె అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News