Pawan Kalyan: బీజేపీతో భేటీకి ముందు సొంత పార్టీ నేతలతో పవన్ చర్చలు

  • కాసేపట్లో బీజేపీ, జనసేన భేటీ
  • భేటీలో చర్చించాల్సిన అంశాలపై పవన్ సమాలోచనలు
  • రాష్ట్ర రాజకీయానికి కొత్త రూపు 

ఏపీలో బీజేపీ, జనసేనలు చేతులు కలపనుండడంతో రాష్ట్ర రాజకీయం కొత్త రూపు సంతరించుకుంటోంది. మరోవైపు, బీజేపీతో భేటీకి ముందు తన సొంత పార్టీ నేతలతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి హోటల్ లో జరిగే ఈ సమావేశంలో... బీజేపీతో చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు చేశారు. ప్రజా సమస్యలు, అమరావతి అంశంపై ఉమ్మడి కార్యాచరణ, 2024 ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరు పార్టీల సమావేశంలో చర్చించనున్నారు.

More Telugu News