Prabhas: రేపు వెలువడనున్న ప్రభాస్ 'జాన్' సినిమా అప్ డేట్!

  • పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ
  • ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే 
  • నిర్మాణ భాగస్వామిగా కృష్ణంరాజు

'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'జాన్' సినిమా రూపొందుతోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి ఈ సినిమాను కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను గురించిన ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు.

దాంతో ఈ సినిమా షూటింగ్ ఎంతవరకూ వచ్చింది? ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారు? ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేకతలు .. విశేషాలు ఏమిటి? అనే విషయాలేవీ బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇవ్వమని సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతుతున్నారు. దాంతో రేపు ఈ సినిమా అప్ డేట్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రేపు ఈ సినిమా గురించిన పూర్తి క్లారిటీ వస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లోను వినిపిస్తోంది.

More Telugu News