Governor: తెలంగాణ గవర్నర్ త్వరలో 'ప్రజాదర్బార్'?

  • రాజ్ భవన్లో ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం 
  • ముమ్మరంగా జరుగుతున్న ఏర్పాట్లు
  • ఎప్పటి నుంచి ప్రారంభించేది త్వరలో ప్రకటన

తెలంగాణ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తమిళి సై ప్రయత్నాలు మొదలు పెట్టారు. రాజ్ భవన్లోనే ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని నిర్ణయించడంతో ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. దీనికి ప్రజాదర్బార్ లేదా ప్రజాభవన్ అని పేరు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో రాజ్ భవన్ అధికారులు, ఐటీ సెల్ అధికారులతో గవర్నర్ సమావేశమై కార్యక్రమానికి సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభించేది త్వరలో తెలుస్తుంది. 

More Telugu News