Sankranthi: సంక్రాంతి కోడిపందాల్లో అపశ్రుతి... కోడికత్తి తగిలి వ్యక్తి మృతి

  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన
  • చింతలపూడి మండలం ప్రగడవరంలో విషాదం
  • గ్రామానికి చెందిన చినవెంకటేశ్ మృతి

సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కోడిపందాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో విషాదం చోటుచేసుకుంది. కోడిపందాలు జరుగుతుండగా, ఓ వ్యక్తి కోడికత్తి బలంగా తగలడంతో మరణించాడు. మృతుడు ప్రగడవరానికి చెందిన చినవెంకటేశ్ (40)గా గుర్తించారు. సాధారణంగా కోడిపందాల్లో కోడిపుంజు కాలికి కట్టే కత్తులు ఎంతో పదునుగా ఉంటాయి. వాటిని నిపుణులైన వ్యక్తులతో మాత్రమే కోడి కాళ్లకు కట్టిస్తుంటారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా తీవ్ర గాయాలపాలవుతారు.

More Telugu News