car accident: అతి వేగంగా వచ్చి బీభత్సం సృష్టించిన కారు.. ఇద్దరి మృతి.. ఐదుగురికి గాయాలు

  • ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో ఘటన
  • మృతులు రాజమండ్రికి చెందిన వారుగా గుర్తింపు
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం, లంకపల్లి వద్ద అతి వేగంగా వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ కారు కర్ణాటక నుంచి రాజమండ్రి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. మృతులు రాజమండ్రికి చెందిన హేమంత్‌ రెడ్డి, సూరి రెడ్డిగా సమాచారం. 

More Telugu News