jubilee hills: రేవ్ పార్టీ నిందితుల కోసం పోలీసుల ముమ్మర గాలింపు

  • రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన విత్తన సంస్థ!
  • వివిధ రాష్ట్రాల నుంచి యువతులు
  • నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు

పరారీలో ఉన్న రేవ్ పార్టీ నిందితుల కోసం వేట ముమ్మరం చేసిన హైదరాబాద్ పోలీసులు, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 10లోని టాట్ పబ్బులో రేవ్ పార్టీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు చేయించేందుకు ప్రయత్నించారు.

సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్బులో తనిఖీలు చేపట్టారు. 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నోటీసులిచ్చి పంపారు. అదే సమయంలో పబ్బు యజమానులు సంతోష్ రెడ్డి, భరత్‌తోపాటు రేవ్ పార్టీ నిర్వాహకులు ప్రసాద్, శ్రీనివాస్ నాయుడు పరారయ్యారు. ఓ విత్తన సంస్థ ప్రతినిధులే ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు గుర్తించిన పోలీసులు, దీనిని నిర్ధారించే పనిలో ఉన్నారు. అందులో భాగంగా పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.

More Telugu News