Sankranti: అంతంతమాత్రంగానే తిరుమల రద్దీ!

  • సంక్రాంతి వేళ తగ్గిన రద్దీ
  • సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం
  • నిన్న రూ. 3.05 కోట్ల హుండీ ఆదాయం

ఓ వైపు సంక్రాంతి పండగ నిమిత్తం ప్రజలంతా స్వస్థలాలకు చేరుకున్న వేళ, పర్వదినం నాడు తిరుమలలో భక్తుల రద్దీ అంతంతమాత్రంగానే ఉంది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటలు, టైమ్ స్లాట్, దివ్య, రూ. 300 ప్రత్యేక దర్శనాలకు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 73,988 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లని టీటీడీ అధికారులు తెలిపారు.

More Telugu News