Allu Arjun: బన్నీ అంకితభావం చూసి అభిమానినయ్యాను: పూజ హెగ్డే

  • త్రివిక్రమ్ చాలా కూల్ పర్సన్
  • ఆయన ఎవరినీ టెన్షన్ పెట్టరు  
  • బన్నీ అంకితభావం ఇష్టం  

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందిన 'అల వైకుంఠపురములో' సినిమా ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా పూజ హెగ్డే పోషించిన పాత్రకి మంచి మార్కులు పడ్డాయి.

ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ తాజా ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడింది.  "త్రివిక్రమ్ గారు కూల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఏమాత్రం టెన్షన్ పడకుండా .. టెన్షన్ పెట్టకుండా ఆయన పనిచేసుకుపోయే తీరు నాకు నచ్చింది. ఇక బన్నీ అంకితభావం చూసిన తరువాత ఆయనకి నేను అభిమానిగా మారిపోయాను. ఆయన కష్టపడే తత్వం నాకు నచ్చింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నన్ను మరింత చేరువ చేసినందుకు చాలా ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చింది.

More Telugu News