Nandamuri Suhasini: పోరాటాన్ని కొనసాగించండి: నందమూరి సుహాసిని        

  • అమరావతి ప్రాంతంలో పర్యటించిన సుహాసిని
  • రైతులు, మహిళలకు సంఘీభావం
  • మహిళలు ఏకమైతే రాజ్యాలు కూలిపోతాయని వ్యాఖ్య

దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె, టీడీపీ నాయకురాలు సుహాసిని ఈరోజు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. మందడంలో నిరసన దీక్షను చేపట్టిన రైతులకు, మహిళలకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. పోరాటాన్ని ఆపవద్దని కోరారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంత మహిళలపై పోలీసుల లాఠీఛార్జీని ఖండిస్తున్నానని చెప్పారు. మహిళలు ఏకమైతే రాజ్యాలు కూలిపోతాయని హెచ్చరించారు. అమరావతి ఉద్యమాన్ని మహిళలు, రైతులు ధైర్యంగా కొనసాగించాలని అన్నారు.

More Telugu News