Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 93 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 33 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతం పైగా లాభపడ్డ హీరో మోటోకార్ప్

ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు... ఎట్టకేలకు చివర్లో పుంజుకుని లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 93 పాయింట్లు లాభపడి 41,953కు చేరింది. నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 12,362 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హీరో మోటోకార్ప్ (2.15%), ఐటీసీ (1.74%), ఎన్టీపీసీ (1.48%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.43%), టెక్ మహీంద్రా (1.42%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.85%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.93%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.84%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.82%), ఎల్ అండ్ టీ (-0.63%).

More Telugu News