Nandamuri Suhasini: రాజధాని అమరావతిని తరలించడం ఎవరి వల్ల కాదు: నందమూరి సుహాసిని

  • మందడంలో పర్యటించిన సుహాసిని
  • రైతులు, మహిళల దీక్షల్లో పాల్గొని సంఘీభావం
  • ఆ ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవచ్చుగా?

రాజధాని అమరావతి ప్రాంతంలో టీ-టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని పర్యటించారు. రాజధానిని తరలించ వద్దంటూ మందడంలో రైతులు, మహిళలు చేస్తున్న దీక్షల్లో ఆమె పాల్గొని, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలపై దాడులను ఖండిస్తున్నట్టు చెప్పారు. రాజధాని అమరావతిని ఇక్కడ నుంచి తరలించడం ఎవరి వల్ల కాదని అన్నారు. టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఆమె స్పందిస్తూ, ఈ ఆరోపణలు నిజమైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని అన్నారు.  

More Telugu News