India-Austrlalia: ప్రారంభంలోనే టీం ఇండియాకు షాక్.. రోహిత్ ఔట్

  • 13 పరుగుల వద్ద రోహిత్ ఔట్
  • 15 బంతుల్లో 10 పరుగులు చేసిన ఓపెనర్
  •  ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 17/1

ఆసీస్ తో తొలి వన్డేలో భారత్ బ్యాటింగ్ చేస్తూ ప్రారంభంలోనే తొలి వికెట్ ను పోగొట్టుకుంది. ఐదో ఓవర్ మూడో బంతికి  స్కోరు 13 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్టార్క్ వేసిన బంతిని గాల్లోకి లేపిన రోహిత్ మిడ్ ఆఫ్ లో వార్నర్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. రోహిత్ 15 బంతుల్లో 10 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లున్నాయి. అనంతరం క్రీజులోకి కెఎల్ రాహుల్ వచ్చాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత ఓపెనెర్లు ధావన్, రోహిత్ లు బ్యాటింగ్ ప్రారంభించారు. మిచెల్ స్టార్క్, కమిన్స్ లు పకడ్బందీగా బంతులు వేస్తూండటంతో పరుగులు కష్టంగా వస్తున్నాయి.

More Telugu News