Allu Arjun: మళ్లీ పూజ హెగ్డేతో కలిసి నటించాలనుంది: అల్లు అర్జున్

  • బన్నీ.. పూజా కాంబినేషన్లో హిట్ కొట్టిన 'డీజే'
  • తదుపరి సినిమాగా వచ్చిన 'అల వైకుంఠపురములో'
  • బన్నీ మాటతో మొదలైన ఊహాగానాలు

అల్లు అర్జున్ తాజా చిత్రంగా రూపొందిన 'అల వైకుంఠపురములో' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాల్లోను విజయవిహారం చేస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నాయికగా పూజ హెగ్డే నటించింది.

ఇంతకు ముందే ఆమె అల్లు అర్జున్ జోడీగా 'దువ్వాడ జగన్నాథం' సినిమాలో నటించింది. 'అల వైకుంఠపురములో' సినిమాతో ఈ జోడీకి రెండో హిట్ లభించింది. ఈ నేపథ్యంలో 'పూజ హెగ్డేతో మరోసారి కలిసి నటించాలని వుంది' అంటూ తన మనసులోని మాటను అల్లు అర్జున్ బయటపెట్టాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నాడు. దాంతో ఆయన తదుపరి సినిమాలోను పూజ హెగ్డేకి ఛాన్స్ లభించవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.

More Telugu News