Crime News: కొన్నేళ్ల క్రితం కోడల్ని చంపి.. ఇప్పుడు భర్తను చంపిన మహిళ!

  • మెదక్‌ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో ఘటన
  • కుటుంబ కలహాలే కారణం
  • అప్పట్లో కోడల్ని చంపి జైలుకి వెళ్లొచ్చిన నిందితురాలు

సొంత కుటుంబ సభ్యులపైనే దాడి చేసి చంపేసింది ఓ మహిళ. కొన్నేళ్ల క్రితం కోడల్ని చంపిన ఆమె... ఇప్పుడు తన భర్తను హత్య చేసింది. మెదక్‌ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఇబ్రహీంపూర్‌కి చెందిన సత్తమ్మ కుటుంబ కలహాల కారణంగా తన భర్త భిక్షపతిని గొడ్డలితో నరికి హత్య చేసింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సత్తమ్మను అరెస్టు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొన్నేళ్ల క్రితం కోడల్ని చంపిన కేసులో సత్తమ్మ జైలుకు వెళ్లి వచ్చిందని పోలీసులు వివరించారు.

More Telugu News