Kalyan Ram: 30 ఏళ్ల తరువాత సుహాసినిగారితో కలిసి నటించాను: హీరో కల్యాణ్ రామ్

  • నా తొలి సినిమా 'బాల గోపాలుడు'
  • బాలనటుడిగా అదే తొలి సినిమా .. అదే చివరి సినిమా 
  • ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందన్న కల్యాణ్ రామ్

నందమూరి హీరోల్లో బాలకృష్ణ .. ఎన్టీఆర్ తరువాత తనదైన ప్రత్యేకతను చాటుకున్న హీరోగా కల్యాణ్ రామ్ కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఎంత మంచివాడవురా' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. బాల నటుడిగా నేను 'బాల గోపాలుడు' సినిమాలో నటించాను. బాల నటుడిగా నేను చేసిన తొలి సినిమా అదే. ఆ తరువాత చదువుపైనే దృష్టి పెట్టడం వలన నేను ఇక సినిమాలు చేయలేదు. ఆ సినిమాలో సుహాసినిగారితో కలిసి నటించాను. మళ్లీ ఇన్నాళ్లకి ..అంటే 30 ఏళ్ల తరువాత సుహాసిని గారితో కలిసి 'ఎంత మంచివాడవురా' చేశాను. నిజంగా ఇది నాకు సంతోషాన్ని కలిగించే విషయం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News