Chandrababu: జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసిన రాజధాని రైతులు

  • బెంజిసర్కిల్ వద్ద భోగి మంటలు
  • సంక్రాంతి పండుగకు దూరంగా రాజధాని రైతులు
  • పెద్ద ఎత్తున హాజరైన రైతులు, మహిళలు, యువత

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఈ తెల్లవారుజామున భోగి మంటలు వేశారు.  టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అఖిలపక్షం నేతలు, జేఏసీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు.

రాజధాని రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటామని గతంలోనే ప్రకటించిన రాజధాని రైతులు.. మరోమారు ఆ విషయాన్ని పునరుద్ఘాటించారు. రాజధాని తరలింపును అంగీకరించేది లేదని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.

More Telugu News