CM KCR: హైదరాబాదులో ముగిసిన ముఖ్యమంత్రుల భేటీ

  • పలు అంశాలపై చర్చించిన కేసీఆర్, జగన్
  • ఆరు గంటల పాటు సాగిన సమావేశం
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జరిగిన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ల సమావేశం ముగిసింది. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో విభజన చట్టం 9,10 షెడ్యూళ్లలోని సంస్థల అంశాలు, గోదావరి జలాల మళ్లింపు, విద్యుత్ ఉద్యోగుల విభజన, ఎన్పీఆర్, ఎన్నార్సీ.. తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం. అలాగే తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించినట్లు తెలుస్తోంది.

More Telugu News