Telangana: బీజేపీని చూసి నేను భయపడుతున్నానంట!: లక్ష్మణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన

  • తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సోషల్ మీడియా సమావేశం
  • హాజరైన మంత్రి కేటీఆర్
  • మోదీ, రాహుల్ అంటే తనకేమీ భయంలేదని వ్యాఖ్యలు

 తాను బీజేపీని చూసి భయపడుతున్నానంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి ఏముందని భయపడాలని కేటీఆర్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో ఆరు వందలకు పైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను నిలపలేకపోయిందని ఎద్దేవా చేశారు. తనకు మోదీ అన్నా, రాహుల్ గాంధీ అన్నా ఎలాంటి భయం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పెన్షన్లలో కేంద్రం వాటా గురించి బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News