school: బడిలోకి దెయ్యాలు వస్తున్నాయట.. క్షుద్రపూజలు చేసి కలకలం రేపిన వైనం

  • వరంగల్ రూరల్ జిల్లా శంభునిపల్లిలో ఘటన
  • గ్రామ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం 
  • ప్రధానోపాధ్యాయురాలి తీరుపై విమర్శలు 

చదువుకుంటే మూఢ నమ్మకాలు పోతాయి.. చదువుకోసం బడికి వెళ్లాలి. అయితే, బడులే మూఢ నమ్మకాలను పెంచుకోవడానికి మొదటిమెట్టుగా నిలిస్తే..? వరంగల్ రూరల్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఇదే తీరు కనపడుతోంది. ఆ బడిలో ప్రధానోపాధ్యాయురాలు మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తోంది.

అక్కడ జరిగిన విషయాన్ని గురించి తెలుసుకుంటే ఈ విషయాన్ని ఎవరైనా నిజమేనంటారు. తమ బడికి దెయ్యాలు, భూతాలు వస్తున్నాయంటూ మూఢనమ్మకంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భూత వైద్యుడితో క్షుద్ర పూజలు చేయించి కలకలం రేపింది. ప్రధానోపాధ్యాయురాలే ఇలా వ్యవహరిస్తే ఇక విద్యార్థులు ఏ మార్గంలో వెళతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమె తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

More Telugu News