Ali Khomeini: తిరుగుబాబు ఇంకా బతికే ఉంది... అమెరికాను హెచ్చరించిన ఇరాన్!

  • సులేమానీకి నివాళులు అర్పించిన ఖొమైనీ
  • క్షిపణి దాడులు అమెరికాకు చెంపదెబ్బ అంటూ వ్యాఖ్యలు
  • అమెరికా ఉనికి ముగించడమే లక్ష్యమంటూ సమరనాదం

ఇరాన్ అగ్రనేత అలీ ఖొమైనీ అమెరికాకు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులను ప్రస్తావిస్తూ, తిరుగుబాటు ఇంకా బతికే ఉందని ఈ ఘటనలు చెబుతున్నాయని, ఇది అమెరికాకు చెంపదెబ్బ మాత్రమేనని అన్నారు. అయినప్పటికీ ప్రతీకార దాడులు, సైనిక చర్యలతో సులేమానీ తిరిగిరారని తెలుసని, ఈ ప్రాంతంలో అమెరికా ప్రాబల్యాన్ని, ఉనికిని అంతమొందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు.

పవిత్ర ఖోమ్ నగరంలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక జనరల్ ఖాసిమ్ సులేమానికి నివాళులు అర్పించిన అనంతరం అలీ ఖొమైనీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇరాన్ క్షిపణి దాడిపై బ్రిటన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇరాన్ దాడి జరిపింది సంకీర్ణ దళాల స్థావరంపై అని, అందులో తమ బలగాలు కూడా ఉన్నాయని ఆరోపించింది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించింది.

More Telugu News