Jagan: కేసీఆర్ ను ప్రత్యేకంగా కలవనున్న వైఎస్ జగన్!

  • 13న ఇద్దరు సీఎంల భేటీ
  • పలు అంశాలపై చర్చ
  • వేదికగా ప్రగతి భవన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా కలవనున్నారు. ఈ నెల 13న వీరిద్దరి భేటీ హైదరాబాద్ లో జరగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్యా పలు అంశాలు చర్చకు రావచ్చని సమాచారం. ఏపీ రాజధాని మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్, జగన్ ల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి ప్రగతి భవన్ వేదిక కానున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరింత సమాచారం వెలువడాల్సివుంది.

More Telugu News