Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • మీడియా వద్దంటున్న అనుష్క!
  • మహేశ్ సినిమా నిడివిపై క్లారిటీ 
  • ముంబైలో నాగార్జున షూటింగ్

 *  ఎప్పుడూ మీడియాతో సరదాగా వుండే కథానాయిక అనుష్క ఇప్పుడు మాత్రం మీడియాను కలవడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఆమె నటించిన 'నిశ్శబ్దం' చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ క్రమంలో మీడియా ఇంటర్వ్యూలకు తాను హాజరుకానని నిర్మాతలకు అనుష్క చెప్పిందట. వివాహానికి సంబంధించిన వ్యక్తిగత ప్రశ్నలను ఎదుర్కోవలసి వస్తుందన్న ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  
*  మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం సంక్రాంతి విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం రన్ టైం తక్కువగా ఉందంటూ వార్తలొస్తున్నాయి. అయితే, సెన్సార్ సర్టిఫికేట్ ను బట్టి దీని రన్ టైం తక్కువేమీ కాదని, రెగ్యులర్ సినిమాల మాదిరి 149 నిమిషాలుగా వుందని సమాచారం.
*  నాగార్జున హీరోగా నటిస్తున్న 'వైల్డ్ డాగ్' చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ ముగిసింది. తదుపరి షెడ్యూలును ఈ నెల 9 నుంచి ముంబైలో నిర్వహిస్తారు. నూతన దర్శకుడు ఆశిషర్ సోలోమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున టెర్రరిస్టులను వేటాడే ఎన్ఐఏ అధికారిగా నటిస్తున్నారు.

More Telugu News