America: మేం కనుక ఆంక్షలు విధిస్తే విలవిల్లాడిపోతారు జాగ్రత్త: ఇరాక్ తీర్మానంపై ట్రంప్ హెచ్చరిక

  • తమ భూభాగం నుంచి వెనక్కి వెళ్లాలంటూ ఇరాక్ పార్లమెంటు తీర్మానం
  • వెళ్లాలంటే తాము పెట్టిన సైనిక ఖర్చును వెనక్కి ఇవ్వాలన్న ట్రంప్
  • కనీవినీ ఎరుగని రీతిలో ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక

గత శుక్రవారం ఇరాక్ విమానాశ్రయంపై రాకెట్ దాడి చేసిన అమెరికా.. ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసిం సులేమానీని హతమార్చింది. తమ భూభాగంపై సులేమానీని అమెరికా హతమార్చడంపై ఇరాక్ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో తమ భూభాగం నుంచి అమెరికా బలగాలు వెంటనే వెనక్కి వెళ్లాలంటూ ఇరాక్ పార్లమెంటు తీర్మానం చేసింది.

ఇరాక్ తీర్మానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. వెళ్తాం కానీ .. ఇరాక్‌పై పెట్టిన సైనిక ఖర్చును ఇచ్చేస్తే అలాగే వెళ్లిపోతామని పేర్కొన్నారు. ఇరాక్‌లో వైమానిక స్థావరాన్ని నిర్మించేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, ఆ డబ్బు మొత్తం ఇచ్చేస్తే వైదొలుగుతామని, లేదంటే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, అదే జరిగితే తాము విధించే ఆంక్షలకు విలవిల్లాడడం ఖాయమని హెచ్చరిక జారీ చేశారు.

More Telugu News