Andhra Pradesh: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ‘జనసేన’ ఇంఛార్జుల నియామకం

  • ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు సమన్వయ కమిటీ
  • ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు
  • ‘జనసేన’ ప్రకటన

రాష్ట్రంలోని పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జులను నియమించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు అయిదుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని నియమించినట్టు తెలిపింది. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ కమిటీలో టి.శివశంకర్, మేడా గురుదత్, సుజాత పండా, బొమ్మిడి నాయకర్, వై.శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుందని తెలిపింది.

More Telugu News