south India: దక్షిణాది సినీ ప్రముఖులతో సమావేశం నిర్వహించాలని మోదీని కోరాను: మంచు విష్ణు

  • మోదీ వెంటనే అంగీకరించారు
  • త్వరలోనే ఈ భేటీ ఉంటుందని ఆశిస్తున్నా
  • ఢిల్లీలో మోదీని కలిసిన మంచు ఫ్యామిలీ 

ప్రధాని మోదీని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు కుటుంబం ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో మంచు విష్ణు వరుస ట్వీట్లు చేశారు. దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులతో ఒక్కసారి సమావేశం నిర్వహించాల్సిందిగా మోదీని కోరానని, అందుకు, ఆయన వెంటనే అంగీకరించారని చెప్పారు. త్వరలోనే ఈ భేటీ ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. విష్ణుమూర్తి దశావతారాలతో కూడిన పెయింటింగ్ ను మోదీకి బహూకరించినట్టు మరో ట్వీట్ లో విష్ణు తెలిపారు.

More Telugu News