New Delhi: ఢిల్లీ ఎన్నికలకు మోగిన గంట... ఫిబ్రవరి 8న పోలింగ్, 11న కౌంటింగ్

  • జనవరి 14న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
  • నామినేషన్ల దాఖలకు ఆఖరు తేదీ జనవరి 21
  • 24వ తేదీలోపు వాపసు తీసుకునే అవకాశం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తెరలేచింది. ఫిబ్రవరి 8న పోలింగ్ ఉంటుందని, 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల 14న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, నామినేషన్లకు జనవరి 21 తుదిగడువు అని వెల్లడించింది. జనవరి 22వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుందని, అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేందుకు జనవరి 24వరకు సమయం ఉంటుందని ఎన్నికల సంఘం వివరించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

More Telugu News