Allu Sirish: అలాంటి ఫేక్ స్క్రీన్ షాట్లు పోస్టు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటా: అల్లు శిరీష్

  • ట్విట్టర్ మీమ్స్ పై శిరీష్ ఆగ్రహం
  • దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు
  • ఓ ట్విట్టర్ ఖాతాలో చిరంజీవి, అల్లు అర్జున్ పై మీమ్స్!

సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతుండడం పట్ల యువ హీరో అల్లు శిరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ స్క్రీన్ షాట్లు పోస్టు చేస్తూ, తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి పోస్టులు పెడితే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. ఓ ట్విట్టర్ అకౌంట్ ద్వారా చిరంజీవి, అల్లు అర్జున్ ల మీమ్స్ పోస్టు చేస్తుండడం పట్ల అల్లు శిరీష్ ఘాటుగా స్పందించినట్టు తెలుస్తోంది.

More Telugu News