Amaravathi: అమరావతిని మార్చొద్దు.. విద్యా ర్థి జేఏసీ 'సేవ్ అమరావతి' బంద్!

  • మూడు రాజధానులు వద్దంటూ నినాదాలు
  • నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం 
  • అణచివేత తీవ్రమైతే ఉద్యమం ఉద్ధృతం 

రాజధాని అమరావతిని మార్చవద్దని కోరుతూ 'సేవ్ అమరావతి' పేరుతో విద్యార్థి జేఏసీ గుంటూరు జిల్లాలో ఈ రోజు చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. జేఏసీ నేతలు గుంటూరు బస్టాండ్ వద్ద కళాశాలల బస్సులు నిలిపివేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అణచివేయాలని చూస్తే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సంఘం ప్రతినిధులు హెచ్చరించారు.

More Telugu News