Narendra Modi: జగన్ పై నరేంద్ర మోదీ సోదరుడి ప్రశంసల వర్షం!

  • ద్వారకా తిరుమలలో ప్రహ్లాద్ మోదీ
  • జగన్ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తని పొగడ్తలు
  • స్వామివారి ధనుర్మాస పూజల్లో ప్రహ్లాద్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమానికి ఆయన అనునిత్యం శ్రమిస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. ద్వారకా తిరుమలలో జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్లు, తెలకుల వర్గాలకు చెందిన వారు 14 లక్షల మంది వరకూ ఉన్నారని, అన్ని రంగాల్లో వెనుకబడిన ఈ కులస్తుల సమస్యలను తాను జగన్ దృష్టికి తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రహ్లాద్ మోదీ, ద్వారకా తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుని ధనుర్మాస పూజల్లోనూ పాల్గొన్నారు.

More Telugu News