Karnataka: విజయ్ 'బిగిల్' ఎఫెక్ట్... రజనీ 'దర్బార్' ప్రత్యేక షోలన్నీ రద్దు!

  • 'బిగిల్' సమయంలో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం
  • రూ. 10 లక్షల విలువైన ఆస్తి నష్టం 
  • ఏ హీరో సినిమాకూ అనుమతులు ఇవ్వబోమన్న పోలీసులు

కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో రజనీకాంత్ తాజా చిత్రం 'దర్బార్' సినిమా బెనిఫిట్ షోలను, ప్రత్యేక ప్రదర్శనలను రద్దు చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. ఈ విషయాన్ని కృష్ణగిరి పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కృష్ణగిరితో పాటు కావేరీ పట్టణంలోనూ ప్రత్యేక షోలు రద్దయ్యాయి.

కొన్ని నెలల క్రితం విజయ్ హీరోగా నటించిన 'బిగిల్' (తెలుగులో విజిల్) విడుదల కాగా, ఆ సమయంలో భారీ విధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 10 లక్షలకు పైగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని అన్ని థియేటర్లలో ఏ హీరో నటించిన సినిమాల స్పెషల్ పోలకు అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు, థియేటర్ యజమానులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

More Telugu News