Amrerica: కెన్యా-అమెరికా మిలటరీ స్థావరంపై ఉగ్రదాడి!

  • కెన్యాలోని అమెరికా మిలటరీ స్థావరంపై రెండుసార్లు దాడి
  • దాడిలో ముగ్గురు అమెరికన్లు మృతి
  • ఆల్ ఖాయిదా ఉగ్రసంస్థతో సంబంధాలు  

కెన్యాలోని అమెరికా మిలటరీ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గంటల వ్యవధిలో ఈ స్థావరంపై జరిగిన రెండో దాడి ఇది. మృతులలో ఒకరు మిలటరీకి చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు కాంట్రాక్టర్లు. కెన్యాలోని లమూ తీర ప్రాంతంలో ఉన్న ఈ స్థావరంపై సోమాలియాకు చెందిన జిహాదీ సంస్థ అల్-షబాబ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రసంస్థకు ఆల్ ఖాయిదా సంస్థతో సంబంధాలున్నాయి.

More Telugu News