CAA: పౌరసత్వ చట్టంపై బాలీవుడ్ ప్రముఖులకు అవగాహన... విందు ఏర్పాటు చేసిన కేంద్రం

  • ముంబయిలో ప్రత్యేక విందు
  • హాజరవుతున్న కేంద్రమంత్రి పియూష్ గోయల్
  • బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, పర్హాన్ అక్తర్ తదితరులు వచ్చే అవకాశం

పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో వ్యతిరేక పవనాలు వీస్తుండడం పట్ల కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తలపోస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖుల కోసం ఓ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై బాలీవుడ్ ప్రముఖులకు అవగాహన కల్పించడమే ఈ విందు ముఖ్యోద్దేశం.

సీఏఏ అమలు తీరు, చట్టంలోని అంశాల గురించి ప్రముఖులకు వివరిస్తారు.  ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ ఈ విందుకు వేదికగా నిలుస్తోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విందుకు హాజరవుతారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ, కబీర్ ఖాన్ తదితరులు హాజరవనున్నారు.

More Telugu News